షాపింగ్మాల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
కోపెన్హగెన్: ఐరోపా దేశం డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ కాల్పుల మోతమోగింది. కోపెన్హగెన్లోని ఫీల్డ్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధాలు విన్న జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్మాల్ను చుట్టుముట్టారు. ఆదివారం సాయంత్రం 5.37 గంటల సమయంలో మాల్లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం 11 నిమిషాల్లోనే 22 ఏండ్ల వయస్సు కలగిన అనుమానితుడిని అరెస్టు చేశామన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/