దేశంలో కొత్తగా 3.37 కరోనా కేసులు
మొత్తం 10,050 ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో నిన్న 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి కంటే నిన్న 9,550 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనా వల్ల 488 మంది ప్రాణాలు కోల్పోయాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
నిన్న కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 21,13,365 మందికి చికిత్స అందుతోందని పేర్కొంది. డైలీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/