Auto Draft
రైతు భరోసా కింద 50.47 లక్షల మందికి పెట్టుబడి సాయం
రూ.1,115 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ
అమరావతి: వైఎస్సార్ రెండో విడత రైతు భరోసా కార్యక్రమం కింద రాష్ట్రంలో 50 లక్షల 47వేల మంద రైతులకు రూ.1,115 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంతి కె.కన్నబాబు అన్నారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.. కోవిడ్ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుభరోసా నిధులు జమ చేసిందన్నారు..
రెండో విడతగా సిఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు బటన్ నొక్కి ప్రారంభిస్తారన్నారు..
వెంటనే 50లక్షల 47 వేల మంది రైతులకు రూ.1,115 కోట్లు వారి అకౌంట్లలో జమ అవుతుందన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/