దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,067

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రోజువారీ కేసులు మరోసారి 3 వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.71 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 2,827 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇదే సమయంలో 3,230 మంది కరోనా నుంచి కోలుకోగా… 24 మంది మృతి చెందారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్న సంగతి గమనార్హం. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,70,165 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,181కి చేరుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/