తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,795 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483 కి చేరింది. ఆసుపత్రుల్లో 27,600 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 86,095 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 788కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/