తెలంగాణలో కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,734 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,325 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697కు చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 31,699 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 95,162 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 836కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 347 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/