అగ్రరాజ్యంలో 24గంటల్లో 2700 మంది మృతి
కరోనాతో 44,845 చేరిన మృతులు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తుంది. ఈవైరస్ అమెరికా అంతటా విస్తరించింది. గత 24 గంటల్లో 2,700 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా వైరస్తో 44,845 మంది చనిపోయారు. కొత్తగా 40 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలకు చేరింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/