దేశంలో కొత్తగా 26,964 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య‌ 3,35,04,534
మొత్తం మృతుల సంఖ్య 4,45,768

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా కొత్తగా 26,964 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,31,498కి చేరింది. అలాగే, నిన్న 34,167 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 383 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,768కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,83,741మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,01,989 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 82,65,15,754డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/