దేశంలో కొత్త‌గా 26,727 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య‌ 3,37,66,707
మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,48,339

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 26,727 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 28,246 మంది కోలుకోవ‌డంతో, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,30,43,144 కు చేరింది. నిన్న క‌రోనాతో దేశంలో 277 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,48,339కు పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 2,75,224 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

మొత్తం కేసుల సంఖ్య‌ 3,37,66,707కు పెరిగింది. ఒక్క కేర‌ళ‌లోనే నిన్న‌ 15,914 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 122 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో 64,40,451 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దేశంలోని వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య‌ 89,02,08,007కు చేరింది.

.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/