దేశంలో కొత్త‌గా 26,041 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య‌ 3,36,78,786
మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,47,194

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 26,041 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య‌ 3,36,78,786కు పెరిగింది. క‌రోనా నుంచి కొత్త‌గా 29,621 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,29,31,972కు చేరింది.

నిన్న‌ 276 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,47,194కు పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 2,99,620 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 38,18,362 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వాడిన డోసుల సంఖ్య‌ 86,01,59,011కు చేరింది. కేర‌ళ‌లో నిన్న‌ 15,951 కేసులు న‌మోద‌య్యాయి. 165 మంది ప్రాణాలు కోల్పోయారు.

.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/