దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు

యాక్టివ్ కేసులు 19,137

న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రోజులుగా 3 వేలకుపైగానే నమోదైన కరోనా కేసులు తాజాగా.. దిగివచ్చాయి. నిన్న 2,568 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 4,30,84,913కి పెరిగింది. కరోనాకు మరో 24 మంది బలవగా.. మొత్తంగా చనిపోయిన వారి సంఖ్య 5,23,889కి చేరింది.

యాక్టివ్ కేసులు 19,137 ఉన్నాయి. 24 గంటల్లో యాక్టివ్ కేసులు 363 తగ్గాయి. మరో 2,911 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887కి పెరిగింది. రోజువారీ కేసుల్లో పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉండగా.. వారం మొత్తం నమోదైన కేసులకు సంబంధించి సగటు పాజిటివిటీ రేటు 0.71 శాతం ఉంది. కాగా, ఇప్పటిదాకా 189.41 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను జనానికి వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/