దేశంలో కొత్తగా 2,55,874 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య‌ 4,90,462

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్యలో త‌గ్గుద‌ల క‌న‌ప‌డింది. నిన్న దేశంలో 2,55,874 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న‌టి కంటే నిన్న 50,190 కేసులు త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు.

2,67,753 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,36,842 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,97,99,202 కేసులు న‌మోద‌య్యాయి. మృతుల సంఖ్య‌ 4,90,462కు పెరిగింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/