దేశంలో కొత్తగా 2527 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వెయ్యి లోపే కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వేలకు చేరువ అవుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,54,952కు చేరాయి. ఇందులో 4,25,17,124 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,079 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 1656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 33 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,149కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో పాటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా.. రికవరీరేటు 98.75 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,87,46,72,536 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/