దేశంలో కొత్తగా 2,51,209 కరోనా కేసులు

21,05,611 యాక్టివ్ కేసులు

అమరావతి: దేశంలో క‌రోనా కేసులు మృతుల సంఖ్య‌పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వివ‌రాలు తెలిపింది. దేశంలో నిన్న 2,51,209 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. అలాగే, క‌రోనా వ‌ల్ల నిన్న 627 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది.

క‌రోనా నుంచి నిన్న‌ 3,47,443 మంది కోలుకున్నారని చెప్పింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 21,05,611 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు
మొత్తం 1,64,44,73,216 డోసుల వ్యాక్సిన్లు వేశారని వివ‌రించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/