తెలంగాణలో కొత్తగా 2,511 కేసులు నమోదు

877కు పెరిగిన మృతుల సంఖ్య

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా  2511 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, మ‌రో 11 మంది మ‌రణించారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,38,395కు చేర‌గా, 877 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 25,729 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. 

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 305 నమోద‌వ‌గా, రంగారెడ్డి జిల్లాలో 184, న‌ల్ల‌గొండ‌లో 170, క‌రీంన‌గ‌ర్‌లో 150, ఖ‌మ్మంలో 142, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 134, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 96, సూర్యాపేట‌లో 96, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 93, నిజామాబాద్‌లో 93,  జ‌గిత్యాల‌లో 85,  సిద్దిపేట‌లో 80, యాదాద్రి భువ‌న‌గిరిలో 78, మంచిర్యాల‌లో 73, రాజ‌న్న‌సిరిసిల్ల‌లో 72, సంగారెడ్డిలో 70, పెద్ద‌ప‌ల్లిలో 65, కామారెడ్డిలో 60,   మ‌హ‌బూబాబాద్‌లో 58, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 48, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 42,  మెద‌క్‌లో 42, వ‌న‌ప‌ర్తిలో 40, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 36, జ‌న‌గామ‌లో 35, నిర్మ‌ల్‌లో 31, జోగులాంబ గ‌ద్వాలలో 27, ఆదిలాబాద్‌లో 23, జ‌య‌శంక‌ర్‌ వికారాబాద్‌లో 19, ములుగులో 18,  ఆసిఫాబాద్ జిల్లాలో 16, నారాయ‌ణ‌పేట‌లో 16, భూపాల‌ప‌ల్లిలో 12 కేసుల చొప్పున ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/