సౌదీలో 24 గంటల్లో 2,509 కొత్త కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,634
రియాధ్: కరోనా వైరస్ సౌదీ అరేబియాలో తన పంజా విసురుతుంది. సౌదీ అరేబియాలో మంగళవారం ఒక్కరోజే 2,509 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో సౌదీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 59,854కి చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 2,886 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 31,634కి చేరింది. కాగా, సౌదీలో 329 మందిని కరోనాతో మృతి చెందారు. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో అధికంగా రియాధ్ , జెడ్డా , మక్కా , మదీనా తదితర ప్రాంతాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/