బల్లి పడిన ఆహారంతో తినడంతో 25 మందికి అస్వస్థత

students food poison
students food poison

నిజామాబాద్: బల్లి పడ్డ ఆహారం తిని ఇరవై అయిదు మంది వసతి గృహ విద్యార్థులు అవస్థలకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.. కోటగిరి బిసి వసతి గృహంలో మంగళవారం రాత్రి విద్యార్థులు భోజనం చేస్తుండగా భోజనంలో బల్లి కనిపించింది. అన్నంలో బల్లిని చూసిన విద్యార్థులు అన్నం తినకుండా పడేశారు.. ముందుగా భోజనం చేసిన విద్యార్థులు కొందరు వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం కోటగిరి ఆస్పత్రికి తీసుకొచ్చారు.. 25మంది విద్యార్థుల్లో 8మంది కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో వారిని బోధన్ ఆస్పత్రికి తరలించారు.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/