శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతుంది. వీకెండ్ కావడం తో భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

శనివారం స్వామివారిని 84 వేల 878 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 41,016 మంది తలనీలాలు సమర్పించగా ,. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.