భారత్‌లో మరో 24,879 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసులు 7,67,296

corona virus-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 24,879 మందికి కొత్తగా కరోనా నిర్థారణ అయిది. అదే సమయంలో 487 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,67,296కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,129కి పెరిగింది. 2,69,789 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,76,378 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,07,40,832 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,67,061 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ఈమేరకు ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/