దేశంలో కొత్తగా 2424 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2424 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,1,437కు చేరింది. ఇందులో 4,40,57,544 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,814 మంది మృతిచెందారు. మరో 28,079 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాకు 12 మంది బలవగా, 2923 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

కాగా, మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.75 శాతం మరణాలు 1.02 శాతం ఉందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ 2.65 శాతంగా ఉందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 218.99 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/