తెలంగాణలో కొత్తగా 2,392 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,392 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,346 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,12,587మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 906కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 304 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/