దేశంలో కొత్తగా 2,380 క‌రోనా కేసులు

యాక్టివ్ కేసులు 13,433

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మళ్ళీ క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిన్న 2,380 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 13,433 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది.

క‌రోనా నుంచి నిన్న 1,231 మంది కోలుకున్నారని, ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి మొత్తం సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని పేర్కొంది. నిన్న క‌రోనా వ‌ల్ల 56 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 5,22,062కి పెరిగింద‌ని పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/