భారత్‌లో 24 గంటల్లో 22,752 కేసులు, 482మరణాలు

మొత్తం కేసుల సంఖ్య 7,42,417

Coronavirus in India
Coronavirus in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజిృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,42,417 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,642కి పెరిగింది. 2,64,944 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,56,831 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,04,73,771 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,62,679 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ఈ మేరకు ఈరోజు ఉదయం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/