భారత్‌లో కొత్తగా 21,821 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674..మొత్తం మృతుల సంఖ్య 1,48,738

corona cases in India

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 21,821 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 26,139 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 299 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,738కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,60,280 మంది కోలుకున్నారు. 2,57,656 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/