తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు

మొత్తం కేసులు సంఖ్య 1,74,774

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,143 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,774 మంది కరోనా బారినపడగా 1,44,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 29,649 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 22,620 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 53,690 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 25,73,005 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 82.43 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 309 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/