తెలంగాణలో కొత్తగా 2,159 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,003

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,159 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2108 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,33,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,005కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 30,443 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 318 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/