తెలంగాణలో కొత్తగా 2,154 పాజిటివ్ కేసులు
1,189కి పెరిగిన మృతుల సంఖ్య
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,04,748కి పెరిగింది. అలాగే, నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారి కారణంగా 8 మంది మృతి చెందారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,189 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,239 మంది కోలుకోవడంతో ఈ సంఖ్య 1,77,008కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 26,551 కేసులు యాక్టివ్గా ఉండగా, వీరిలో 21,864 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 54,277 కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 33,46,472కు పెరిగింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/