కర్ణాటక దావణగెలో కరోనా కలకలం

గ్రీన్ జోన్ దావణగెరెలో ఒక్కరోజులో 21 కరోనా కేసులు

corona virus
corona virus

కర్ణాటక: కరోనా వైరస్‌ పలు రాష్ట్రల్లో విసృత్తంగా వ్యాపిస్తుంది. తాజాగా కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆదివారం ఒక్కరోజులో 21 కరోనా పాజిటివ్ కేసులు రావడం అధికారులను తీవ్ర కలవరపెడుతుంది. అయితే వారం రోజుల క్రితం కంటైన్ మెంట్ పీరియడ్ ముగియడంతో ఈ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. ఆపై ప్రజలు కాసింత రిలాక్స్ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో దావణగెరె ప్రాంతంలోని కొందరిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో మొత్తం 164 మంది నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని పరీక్షలకు పంపారు. 21 మందిలో వైరస్ ఉన్నట్టు తేలడంతో, అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. ఎవరి నుంచి వారికి కరోనా సోకిందన్న వివరాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/