భారత్‌లో 24 గంటల్లో 20,903 కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 6,25,544

coronavirus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 20,903 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 379 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,25,544కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,213కి పెరిగింది. 2,27,439 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,79,892 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 92,97,749 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,41,576 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/