దేశంలో కొత్తగా 2,075 కరోనా కేసులు

న్యూడిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. గత 24 గంటల్లో కేవలం 2,075 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,383 మంది కోలుకోగా, 71 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 27,802గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56కి పడిపోయింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,24,61,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,16,352 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1,81,04,96,924 డోసుల వ్యాక్సిన్ వేశారు. రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/