తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283.. మృతుల సంఖ్య మొత్తం 1,116

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,072 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,259 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,58,690 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,116కు చేరింది. ప్రస్తుతం 29,477 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 283, రంగారెడ్డి జిల్లాలో 161 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/