తెలంగాణలో కొత్త‌గా 204 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,522..మొత్తం మృతుల సంఖ్య 1,656

హైదరాబాద్: తెలంగాణలో కొత్త‌గా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 170 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,851 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,656గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,015 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 624 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 37 మందికి క‌రోనా సోకింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/