తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా కేసులు

మొత్తం కేసులు 1,95,609..మొత్తం మృతుల సంఖ్య 1,145

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణ కొత్తగా 2,009 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,437 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,65,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,145 కు చేరింది. ప్రస్తుతం 28,620 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 293, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌ విడుదల చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/