న్యూజిలాండ్‌లో మళ్లీ కేసులు నమోదు

కరోనాపై విజయం సాధించామని వారం క్రితమే ప్రకటన

corona positive
corona positive

న్యూజిలాండ్‌: న్యూజిలాండ్‌ కరోనా వైరస్ ‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తమ దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్‌ బాధిత మహిళ కూడా కోలుకుందని ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటన చేసిన వారం రోజులకే ఆ దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు వెలుగుచూడడం గమనార్హం. విదేశాల నుంచి వస్తోన్న వారి వల్లే మళ్లీ న్యూజిలాండ్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిట‌న్ నుంచి తమ దేశానికి వ‌చ్చిన ఇద్ద‌రికి క‌రోనా సోకిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. సుమారు 24 రోజుల అనంతరం ఆ దేశంలో మళ్లీ తొలిసారి వైర‌స్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం న్యూజిలాండ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేసింది. భ‌విష్య‌త్తులో తమ దేశంలో కొత్తగా క‌రోనా కేసులు మ‌ళ్లీ న‌మోదయ్యే అవ‌కాశాలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని జెసిండా ప్రజలను హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/