ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే నిర్ధిష్టమైన సమాచారంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారిని అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ సంస్థకు చెందిన అజీజ్ రసీ నాజర్, షాహిద్ అహ్మద్గా గుర్తించామన్నారు.
పుల్వామాలో ఈ నెల 2న పశ్చిమబెంగాల్కు చెందిన మునీర్ ఇస్లామ్ అనే కార్మికుడిపై జరిగిన ఉగ్రదాడిలో వీరిద్దరి హస్తముందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్, రెండు పిస్తోల్లు, ఆయుధ సమాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/