2-డీజీ ఔషధం ధరను వెల్లడించిన కేంద్రం
ఒక్కో సాచెట్ ధర రూ. 990
New Delhi: డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో సాచెట్ ధర రూ. 990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. . అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు తెలిపింది .
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/