దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 1,36,478

న్యూఢిల్లీః దేశలో కరోనా కేసులు ఉద్ధృతి కొనసాగుతుంది. బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది. ఇందులో 4,34,24,029 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మంది మృతిచెందారు. మరో 1,36,478 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 53 మంది కరోనాకు బలవగా, 20,419 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.50 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 205.22 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ప్రకటించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/