తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా కేసులు

తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 9 మంది మృత్యువాత

1,967 new corona cases in Telangana
1,967 new corona cases in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,967 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదుకాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 9 మంది మృత్యువాతపడ్డారు

. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,85,833 మంది కరోనా బారినపడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 30,234 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

24,607 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 1,100 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,50,869 టెస్టులు పూర్తిచేసినట్లు వివరించింది

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/