భారత్‌లో 24 గంటల్లో 19,459 కొత్త కేసులు

మొత్తం మృతుల సంఖ్య 16,475

coronavirus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,475కి పెరిగింది. 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,723 మంది కోలుకున్నారు. కాగా, జూన్‌ 28 వరకు దేశంలో మొత్తం 83,98,362 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 1,70,560 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/