తెలంగాణలో ఒక్కరోజే 1,924 కొత్త కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 కేసులు నమోదు

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. నిన్న ఒక్క రోజే 1,924 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 29,536కు పెరిగింది. నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా మృతుల సంఖ్య 24కు పెరిగింది. తాజాగా, 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17,279కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 11,933 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. నిన్న నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 ఉండగా, ఆ తర్వాత అత్యధికంగా నమోదైన జిల్లాల్లో రంగారెడ్డి (99), మేడ్చల్‌ (43), వరంగల్ రూరల్‌ (26), సంగారెడ్డి (20), నిజామాబాద్‌ (19), మహబూబ్‌నగర్ (15), కరీంనగర్ (14) ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/