దేశంలో కొత్తగా 18,987 కొరోనా కేసులు

మొత్తం మ‌ర‌ణాలు 4,51,435

న్యూఢిల్లీ: దేశంలో నిన్న 18,987 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. అలాగే, నిన్న‌ 19,808 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 246 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,40,20,730 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,06,586 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి మొత్తం 3,33,62,709 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,51,435గా ఉంది. నిన్న 35,66,347 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వేసిన డోసుల సంఖ్య‌ 96,82,20,997కు పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/