తెలంగాణలో కొత్తగా 1,842 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నేటి ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 1,842 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1825 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. ఆసుపత్రుల్లో 22,919 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 82,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 761కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 373 మందికి కొత్తగా కరోనా సోకింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/