దేశంలో కొత్తగా 18,132 కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 4,50,782
corona virus-india
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 18,132 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, నిన్న 21,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,93,478కి చేరింది. నిన్న 193 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,782కి చేరింది.
ప్రస్తుతం 2,27,347 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 95,19,84,373 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేరళలో నిన్న ఒక్కరోజులో 10,691 కరోనా కేసులు నమోదయ్యాయి. 85 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/