తెలంగాణలో కొత్తగా 1,811 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346.. మొత్తం మృతుల సంఖ్య 1,217

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,811 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,072 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,83,025 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,217 కు చేరింది. ప్రస్తుతం 26,104 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 291, రంగారెడ్డి జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/