తెలంగాణాలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,717..మొత్తం మృతుల సంఖ్య 1,650

హైదరాబాద్: తెలంగాణలో కొత్త‌గా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 163 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,717 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,195 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,650గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,872 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 733 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 44 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/