భారత్లో కొత్తగా 17,921 మందికి కరోనా నిర్ధారణ
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,85,561..మొతం మృతుల సంఖ్య 1,58,189
corona virus-india
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 17,921 మందికి కరోనా నిర్ధారణ కాగా, గత 24 గంటల్లో 22,854 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… 18,100 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,85,561కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 126 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,189కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,38,146 మంది కోలుకున్నారు. 1,89,226 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,42,58,293 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,78,416 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/