తెలంగాణలో కొత్తగా 1,763 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,763 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 95,700కు చేరాయి. నిన్న 8 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 719కి చేరింది. తాజాగా 1,789 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 73,991 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 20,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.7శాతం ఉండగా దేశంలో 1.92శాతంగా ఉందని, అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 77.31శాతంగా ఉందని ఇది దేశ సగటుకంటే ఎక్కువ అని వివరించింది. తాజాగా నమోదైన 1,763 పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 484 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 169, రంగారెడ్డిలో 166 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24గంటల్లో 24,542 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,97,470 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/