తెలంగాణలో కొత్త‌గా 170 పాజిటివ్ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,742.. మొత్తం మృతుల సంఖ్య 1,640

హైదరాబాద్: తెలంగాణలో కొత్త‌గా 170 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 196 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,166 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,640 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,936 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 812 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 28 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/