తెలంగాణలో కొత్తగా 1,682 కేసులు నమోదు
మొత్తం కేసులు..మొత్తం మరణాలు 711

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,682 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,070 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఆసుపత్రుల్లో 21,024 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 72,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 711 కి చేరింది. జీహెచ్ఎంసీలో 235 మందికి కొత్తగా కరోనా సోకింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/