తెలంగాణాలో కొత్తగా 168 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,254..మొత్తం మృతుల సంఖ్య 1,635

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త‌గా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అదే సమయంలో 163 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,707 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,635 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,912 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 796 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 29 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/